కోల్కతా: ఉపాధి హామీ పథకానికి సంబంధించిన బకాయిలపై కేంద్రం ఈ నెల 31 నాటికి స్పందించకుంటే ఆందోళనను తిరిగి ప్రారంభిస్తామని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) హెచ్చరించింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ ‘కేంద్రం నుంచి పశ్చిమ బెంగాల్కు చాలా బకాయిలు రావాల్సి ఉన్నది.
ఇందులో ముఖ్యంగా ఉపాధి హామీ బకాయిలు ఉన్నాయి. ఈ నెల చివరినాటికి చూస్తాం. కేంద్రం స్పందిచకుంటే ఆందోళనను తిరిగి ప్రారంభిస్తాం’ అని పేర్కొన్నారు.