Akhilesh Yadav | వచ్చే సాధారణ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని సమాజ్వాదీ పార్టీ (SP) అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) అన్నారు. 2024లో జరుగనున్న ఎన్నికల్లో బీజేపీ (BJP) నేతృత్వంలోని ఎన్డీఏను (NDA) పీడీఏ (PDA) ఓడిస్తుందని చెప్పారు. పీడీఏ అంటే వెనుకబడిన వర్గాలు (Pichde), దలిత్ (Dalit), మైనార్టీలు (Alpasankhyak) అని చెప్పారు. పెద్ద జాతీయ పార్టీలు తమకు సహకరిస్తే యూపీలోని 80 లోక్సభ స్థానాల్లో (Lok Sabha seats) బీజేపీని ఓడిస్తామని స్పష్టం చేశారు. 80 సీట్లలో ఓడించు.. బీజేపీని తొలగించు అనే నినాదాన్ని ఇచ్చారు. కాగా, స్థానికంగా ఉండే బలాబలాల ఆధారంగానే భాగస్వామ్య పక్ష పార్టీలకు సీట్లు కేటాయిస్తామని చెప్పారు.
ఉత్తరప్రదేశ్లో మొత్తం 80 ఎంపీ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ ఐదు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. అయితే ఈ మధ్య జరిగిన ఉప ఎన్నికల్లో వాటిలో రెండు సీట్లను కోల్పోయింది. కాగా, భాగస్వామ్య పక్షాలకు ఉన్న బలాబలాలను బట్టే సీట్లను కేటాయిస్తామని చెప్పారు. 2017లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసిన ఎస్పీ, 2019 లోక్సభ ఎన్నికల్లో బీఎస్పీతో పొత్తుపెట్టుకున్నది.