Pawan Khera : కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో ట్రైనీ వైద్యురాలిపై లైంగిక దాడి ఘటన దేశవ్యాప్తంగా పెను దుమారం రేపింది. ఈ ఘటనను పార్టీలకు అతీతంగా ప్రతిఒక్కరూ ఖండించడంతో పాటు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోల్కతా ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ముర్ము ప్రకటనను స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా పేర్కొన్నారు.
ఈ ఘటనపై ప్రకటన చేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించడం సంతోషకరమని ఆయన అన్నారు. మహిళల భద్రతకు సంబంధించి ఈ ఘటనపై మనమందరం పెదవివిప్పడం కీలకమని చెప్పారు. రాష్ట్రపతి కేవలం ఘటనపై మాట్లాడటమే కాకుండా ఇతర ఘటనలపై కూడా స్పందించాలని సూచించారు. జన్మాష్టమి నాడు ఫరక్కాబాద్లో ఇద్దరు దళిత బాలికలు ఉరికి వేలాడుతూ కనిపించిన ఘటనపైనా ఇదే స్దాయిలో రాష్ట్రపతి ప్రస్తావించాలని అన్నారు.
మహారాష్ట్రలో బద్లాపూర్, రత్నగిరి, పుణే, కొల్హాపూర్ సహా పలు ప్రాంతాల్లో వెలుగుచూస్తున్న లైంగిక వేధింపుల ఘటనలపైనా ఆమె మాట్లాడాలని కోరారు. ఈ ఘటనలన్నీ కూడా దేశాన్ని షాక్కు గురిచేసినవేనని చెప్పారు. జోధ్పూర్లో నిన్న జరిగిన ఘటన కూడా అందరి హృదయాలనూ కలిచివేస్తోందని అన్నారు. ఈ హేయమైన నేరాలపై కూడా రాష్ట్రపతి మాట్లాడాలని ఆయన కోరారు.
Read More :
Mahabubnagar | పాలమూరులో హైడ్రా తరహా కూల్చివేతలు..