న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: ఎయిర్పోర్టుల్లో విమానాల నుంచి దిగిన ప్రయాణికులకు త్వరగా వారి బ్యాగేజీ అందేలా చూడాలని, 30 నిమిషాల్లోగా ఈ ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) ఏడు షెడ్యూల్డ్ విమానయాన సంస్థలను ఆదేశించింది. విమాన ప్రయాణికులు తమ లగేజీని పొందడం ఆలస్యమవుతున్నట్టు ఫిర్యాదులు వస్తుండటంతో బీసీఏఎస్ ఈ నెల 16న ఎయిర్ ఇండియా, ఇండిగో, ఆకాశ ఎయిర్, స్పైస్జెట్, విస్తారా, ఏఐఎక్స్ కనెక్ట్, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సంస్థలకు ఈ ఆదేశాలు జారీ చేసింది.