న్యూఢిల్లీ, జూలై 29: దేశవ్యాప్తంగా ఉపాధిహామీ కూలీలకు వేర్వేరు వేతనాలు ఉండటాన్ని పార్లమెంటరీ ప్యానెల్ తప్పుబట్టింది. అన్ని రాష్ర్టాల్లో ఉపాధిహామీ కూలీలకు సమాన వేతనం చెల్లించే అంశాన్ని పరిశీలించాలని కేంద్రానికి ప్యానెల్ సూచించింది. వేతనాలు పెంచకపోవడంతో కూలీలు పనులకు దూరమవుతున్నారని పేర్కొంది.
వివిధ రాష్ర్టాల్లో ఉపాధిహామీ కూలీలకు రూ.204 నుంచి రూ.331 వరకు కూలీగా చెల్లిస్తున్నట్టు… ఇందులో భారీ వ్యత్యాసం ఉన్నట్టు ప్యానెల్ తెలిపింది. తాజాగా సవరించిన వేతనాల ప్రకారం మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో అతి తక్కువగా రూ.221 ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఉపాధిహామీ వేతనాలు తక్కువగా ఉండటంపై పార్లమెంటరీ ప్యానెల్ ఆగ్రహం వ్యక్తం చేసింది.