Parliament Winter Session | లోక్సభ జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (రెండవ సవరణ) బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. బిల్లు జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో 33శాతం రిజర్వేషన్లు కేటాయించనున్నారు. అలాగే, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ (సవరణ)కు సైతం ఆమోదముద్ర వేసింది. బిల్లులపై చర్చ సందర్భంగా హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ సమాధానమిచ్చారు. నరేంద్ర మోదీ ప్రభుత్వ నిబద్ధత, సంకల్పానికి అనుగుణంగా మహిళలకు సమానత్వం, అవకాశాల కోసం బిల్లును ప్రవేశపెట్టామన్నారు.
బిల్లులతో అసెంబ్లీలో మహిళలకు సముచిత స్థానం లభించేలా మోదీ ప్రభుత్వం సాహసోపేతమైన ముందడుగు వేసిందన్నారు. మహిళల అభ్యున్నతి కోసం.. అసెంబ్లీల్లో వారికి మూడింట ఒక వంతు సీట్లు మహిళలకు రిజర్వ్ చేసేలా బిల్లు తీసుకువచ్చామన్నారు. బిల్లుకు కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి మద్దతు తెలిపారు. జమ్మూ కశ్మీర్లో ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
అయితే, జమ్మూ కశ్మీర్ పట్ల కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ విమర్శించారు. అలాగే ప్రధాన ఎన్నికల కమిషన్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల నియామక బిల్లుకు సైతం రాజ్యసభ ఆమోదం తెలిపింది. వాయిస్ ఓటింగ్ ద్వారా బిల్లుకు రాజ్యసభ ఆమోదముద్ర వేసింది. ఆగస్టు 10న సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC), ఇతర ఎన్నికల కమిషనర్ల (ECs) నియామకాలకు సంబంధించిన బిల్లుకు పెద్దల సభ పాస్ చేసింది. బిల్లు ఆమోద సమయంలో సభ నుంచి విపక్షాలు వాకౌట్ చేశాయి.