Parliament Security Breach | పార్లమెంట్ భద్రతా వైఫల్యం కేసులో నిందితురాలు నీలం తల్లిదండ్రులు కోర్టుకెక్కారు. నీలంతో పాటు మరో ఐదుగురిపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని కోరుతూ ఢిల్లీలోని పాటియాలా హౌస్కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రిమాండ్ వ్యవధిలో ఆమెను కలిసేందుకు అనుమతి ఇచ్చేలా ఢిల్లీ పోలీసులను ఆదేశించాలని కోర్టును కోరారు. ఈ మేరకు కోర్టు ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. కేసును ఈ నెల 18న విచారించనున్నట్లు పేర్కొంది.
ఇదిలా ఉండగా.. ఈ కేసులో మహేశ్ కుమావత్ అనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ ఆరో నిందితుడిని అదుపులోకి తీసుకున్నది. అతని స్వస్థలం రాజస్థాన్. లలిత్ ఝా ఢిల్లీ పోలీసుల ఎదుట లొంగిపోయిన సమయంలో మహేశ్ కుమావత్ తనతో ఉన్నాడని స్పెషల్ సెల్ వర్గాలు తెలిపాయి. మరో వైపు పార్లమెంట్లో భద్రతా వైఫల్యం కేసులో ప్రధాన సూత్రదధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న లలిత్ ఝాను కోర్టు శుక్రవారం ఏడు రోజుల పోలీస్ కస్టడీకి పంపింది.
ఇదే కేసులో అరెస్టయిన నలుగురిని పాటియాలా హౌస్కోర్టు అదనపు సెషన్స్ జడ్జి హర్దీప్ కౌర్ ధర్మాసనం ఏడురోజుల పోలీస్ కస్టడీకి పంపింది. లోక్సభలో బుధవారం విజిటర్స్ గ్యాలరీ నుంచి ఇద్దరు వ్యక్తుల సభలోకి దూకి కలర్ స్మోగ్ను వదిలారు. ఆ తర్వాత ఎంపీ సీట్ల వద్దకు వెళ్లి వీరంగం సృష్టించారు. పలువురు ఎంపీలు నిందితుడిని పట్టుకొని భద్రతా సిబ్బందికి అప్పగించిన విషయం తెలిసిందే.