Supreme Court | న్యూఢిల్లీ: ఖనిజాల హక్కులపై పన్ను విధించే అధికారాన్ని భారత రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వలేదని, ఆ అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఇచ్చిందని సుప్రీంకోర్టు గురువారం చెప్పింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ స్పష్టత ఇచ్చింది.
మైనింగ్ లీజులపై కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే రాయల్టీని పన్నుగా పరిగణించవచ్చునా? అనే అంశాన్ని ఈ ధర్మాసనం విచారించింది. ఈ రాయల్టీని పన్నుగా పరిగణించవచ్చునని 1989లో ఏడుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు చెప్పింది.