న్యూఢిల్లీ, జనవరి 29: ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో మంగళవారం అఖిలపక్ష సమావేశాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది. ఈ మేరకు అన్ని పార్టీలకు ఇప్పటికే సమాచారం ఇచ్చింది.
సమావేశాల ప్రారంభానికి ముందు అఖిలపక్ష భేటీని ఏర్పాటు చేసి అభిప్రాయాలు కోరడం సంప్రదాయంగా వస్తున్న విషయం తెలిసిందే. అయితే మోదీ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ కానుండటం, త్వరలో లోక్సభ ఎన్నికలు జరుగనుండటంతో ఈ సారి సమావేశాలు చాలా వాడీవేడీగా జరుగనున్నాయి.