Raghav Chadha | ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా తిరిగి రాజ్యసభలో మళ్లీ ఎంట్రీ ఇచ్చారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాఘవ్ చద్దా సస్పెన్షన్ అంశంపై రాజ్యసభ ప్రివిలేజెస్ కమిటీ పార్లమెంట్లో సమావేశమైంది. చైర్మన్, ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్ ఆప్ ఎపినీ తిరిగి సభలోకి అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు ప్రవేశపెట్టిన తీర్మానంపై రాఘవ్ చద్దాను సస్పెండ్ చేసినట్లు చైర్మన్ తెలిపారు. ఎంపీ సస్పెన్షన్ సరిపోతుందని ప్రివిలేజెస్ కమిటీ గుర్తించిందని చెప్పారు. ఈ మేరకు సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆప్ ఎంపీ మాట్లాడుతూ.. ఆగస్టు 11న రాజ్యసభ నుంచి సస్పెన్షన్ విధించారని.. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లినట్లు పేర్కొన్నారు.
111 రోజుల తర్వాత సస్పెన్షన్ రద్దు చేశారని.. ఉపసంహరించినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన సుప్రీంకోర్టు, రాజ్యసభ చైర్మన్కు ధన్యవాదాలు తెలిపారు. అయితే, దేశ రాజధాని ఢిల్లీ (సవరణ)-2023పై ప్రతిపాదిన సెలెక్ట్ కమిటీ అనుమతి తీసుకోకుండా కొందరు సభ్యుల పేర్లను చేర్చినందుకు రాఘవ్ చద్దాపై సస్పెన్షన్ వేటు పడింది. రాజ్యసభ నేత పీయూష్ గోయల్ సభలో తీర్మానం ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది.