న్యూఢిల్లీ : నీతి ఆయోగ్ నూతన కార్యనిర్వహణ అధికారి (సీఈవో)గా ఐఏఎస్ అధికారి పరమేశ్వరం అయ్యర్ శుక్రవారం నియమితులయ్యారు. వ్యక్తిగత, సిబ్బంది శిక్షణ విభాగం అయ్యర్ నియామకాన్ని ప్రకటించింది.
రెండేండ్ల పాటు పరమేశ్వరం అయ్యర్ ఈ పదవిలో కొనసాగుతారు. నీతి ఆయోగ్ ప్రస్తుత సీఈవో అమితాబ్ కాంత్ పదవీకాలం ఈనెల 30తో ముగియనుండటంతో ఆయన స్ధానంలో నూతన సీఈవోగా అయ్యర్ను నియమించారు.