న్యూఢిల్లీ: ఒక జంట ఏకంగా పెండ్లి వేదికపైనే ముద్దులు పెట్టుకున్నది. పురోహితుడు చెప్పడంతో వధువరులు తీయని ముద్దుల్లో మునిగిపోయారు. షట్టర్డౌన్ ఫోటోగ్రఫీ పేరుతో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక జంట వివాహం చాలా ఆడంబరంగా జరిగింది. ఇక వధువరులు ముద్దు పెట్టుకోవచ్చని, ఇది వారికి చెప్పాలంటూ వరుడి తండ్రి పురోహితుడిని కోరారు.
దీనికి ఆ పురోహితుడు చాలా సిగ్గుపడిపోయారు. వరుడి తండ్రి మాటలను తన మాటలుగా పరిగణించాలని వధువరులకు తెలిపాడు. అయితే పురుహితుడే వారికి చెప్పాలని బంధువులు పట్టుబడ్డారు. చేసేదేమీ లేక ‘ఇప్పుడు వారిద్దరూ ముద్దులు పెట్టుకుంటారు’ అని సిగ్గుపడుతూ పెండ్లి తంతు మాదిరిగా పురోహితుడు హిందీలో అన్నారు. దీంతో వధువరులు తీయని ముద్దుల్లో మునిగిపోయారు. పెండ్లికి హాజరైన బంధువులు కూడా చప్పట్లతో కొత్త జంటను ఎంకరేజ్ చేశారు.
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. పెండ్లి వేదికపై వధువరులు ముద్దు పెట్టుకోవడాన్ని కొందరు హర్షించారు. ఇదే అసలైన పెండ్లి అని ఒకరు అన్నారు. చూడ ముచ్చటగా ఉన్నదని మరొకరు కామెంట్ చేశారు.
అయితే కొందరు మాత్రం దీనిపై విమర్శలు చేశారు. ఇది భారతీయ సంప్రదాయం కాదని, పశ్చిమ దేశాల ఆచారమని ఆరోపించారు. అగ్నిసాక్షిగా జరిగే వివాహ తంతును అవమానించారంటూ ఒకరు విమర్శించారు.
https://www.instagram.com/p/CVKGVpaBfEI/?utm_source=ig_web_copy_link