కోల్కతా: పశ్చిమబెంగాల్కి చెందిన సందీపన్ సర్కార్, అదితి దాస్ అనే జంట ఈనెల 24న వినూత్నంగా డిజిటల్ వివాహం జరుపుకోబోతున్నారు. 450 మంది అతిథులను ఆహ్వానించారు. అయితే వీరిలో 100 నుంచి 120 మంది మాత్రమే ప్రత్యక్షంగా హాజరవుతారు. మిగతా వారు గూగుల్ మీట్లో లైవ్ వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. అతిథుల ఇండ్లకు జొమాటో ద్వారా వివాహ భోజనం డెలివరీ చేస్తారు. కరోనా నేపథ్యంలో అతిథుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఏర్పాట్లు చేసినట్టు సందీపన్ తెలిపారు.