బలోత్రా: క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఓటమికి ఓ అపశకునమే కారణమని ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశించి పరోక్షంగా రాహుల్గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్-ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ను వీక్షించేందుకు వచ్చిన వాళ్లలో ఓ అపశకునం ఉన్నదని, ఆ అపశకునం వల్లనే భారత్ మ్యాచ్ ఓడిపోయిందని రాహుల్గాంధీ వ్యాఖ్యానించారు.
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బలోత్రాలో జరిగిన ఓ సభలో మాట్లాడుతూ రాహుల్గాంధీ ఈ కామెంట్స్ చేశారు. ఆయన ప్రధాని నరేంద్రమోదీ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించనప్పటికీ.. ఆ వ్యాఖ్యలు ప్రధాని మోదీని ఉద్దేశించినవేనని స్పష్టంగా తెలుస్తున్నది. కాగా రాహుల్గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. రాహుల్గాంధీ తక్షణమే ప్రధానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నది.