న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ఉగ్రవాదంపై పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దేశమే ఉగ్రవాదానికి బీజాలు వేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పెషావర్ మసీదులో ఆత్మాహుతి దాడి ఘటన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయ డం గమనార్హం. మంగళవారం పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీలో మాట్లాడుతూ ‘నేను ఎక్కువగా మాట్లాడను. కానీ ప్రారంభంలో మనమే ఉగ్రవాదానికి బీజాలు వేశామనే విషయాన్ని క్లుప్తంగా చెబుతున్నా ను’ అని పేర్కొన్నారు. పెషావర్ ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారని ఆసిఫ్ ప్రశ్నించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశమంతా ఏకమై పోరాడాలని, తద్వారా దేశాన్ని చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు.