శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోకి (Jammu Kashmir) చొరబడేందుకు ప్రయత్నించిన పాకిస్థానీ (Pakistani intruder) వ్యక్తిని సరిహద్దు భద్రతా దళం (BSF) మట్టుబెట్టింది. గురువారం తెల్లవారుజామున 2.50 గంటలకు సాంబా (Samba) సెక్టార్లోని బోర్డర్ ఔట్ పోస్టు మంగు చక్ (Mangu Chak) వద్ద ఓ వ్యక్తి అంతర్జాతీయ సరిహద్దులు దాటి దేశంలోకి వస్తున్నాడు. గుర్తించిన బీఎస్ఎఫ్ జవాన్లు అతడిని హెచ్చరించారు. అయినప్పటికీ అతను వస్తుండటంతో కాల్పులు జరిపారు. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడని బీఎస్ఎఫ్ అధికార ప్రతినిధి తెలిపారు. అనంతరం సాంబా సెక్టార్లో గాలింపు ముమ్మరం చేశామని వెల్లడించారు.