చండీగఢ్ : సరిహద్దు భద్రతా దళం (BSF) పంజాబ్లో భారత్ – పాక్ సరిహద్దులోని కాసోవాల్ వద్ద చెరుకు తోటలో ఓ డ్రోన్ను గుర్తించింది. అలాగే 782 గ్రాముల హెరాయిన్ను సైతం స్వాధీనం చేసుకున్నది. డ్రోన్తో పాటు దొరికిన హెరాయిన్ను రాందాస్ పోలీస్ స్టేషన్ పోలీసులకు అప్పగించారు. బీఎస్ఎఫ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాందాస్పూర్ పోలీస్స్టేషన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గురుప్రీత్ సింగ్ బంగు తెలిపారు.
ఈ నెల 2న బీఎస్ఎఫ్కు చెందిన 113 బెటాలియన్ బృందం ఇండో – పాక్ సరిహద్దుల్లోని కసోవాల్ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నది. ఈ క్రమంలో చెరుకు తోటలో ముళ్లతీగ వెనుక అనుమానాస్పదంగా ఓ వస్తువు కనిపించింది. ఆ తర్వాత తనిఖీ చేయగా.. డ్రోన్ కనిపించింది. అదే స్థలంలో 782 గ్రాముల హెరాయిన్ లభించింది. ఆ తర్వాత వాటిని పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు.