న్యూఢిల్లీ, జూలై 29: తీవ్ర ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న పాకిస్థాన్ చివరికి సింహాలను అమ్మాలని చూస్తున్నది. అది కూడా బర్రెల కన్నా తక్కువ రేటుకు విక్రయించాలని భావిస్తున్నది. లాహోర్ సఫారీ జూలో 12 ఆఫ్రికన్ సింహాలు ఉన్నాయి.
అయితే వాటిని సాదడం కష్టంగా మారడంతో అమ్మేయాలని అధికారులు నిర్ణయించారు. ఒకొక్క సింహాన్ని రూ.1.5 లక్షలకు అమ్మాలనుకుంటున్నారు. అయితే ప్రస్తుతం పాకిస్థాన్లో ఒకొక్క బర్రెను దాదాపు రూ.3.5 లక్షల వరకు విక్రయిస్తున్నారు.