ద్వారకా: గుజరాత్ తీరంలో ఇండియన్ కోస్టు గార్డుకు చెందిన పోలీసులు .. అక్రమంగా భారత జలాల్లోకి ప్రవేశించిన పాకిస్థాన్ బోటును పట్టుకున్నారు. గుజరాత్ ఏటీఆఎస్ ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారం మేరకు ఈ అరెస్టు జరిగింది. పది మందితో ఉన్న పాక్ బోటును గుజరాత్ తీరంలో పట్టుకున్నారు. ఆ బోటులో ఆయుధాలను సరఫరా చేస్తున్నారు. ఇంకా సుమారు 40 కేజీల బరువు ఉన్న మాదకద్రవ్యాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ నార్కోటిక్స్ విలువ మార్కెట్లో సుమారు 300 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.