పాక్ నూతన ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. తాను పాక్ నూతన ప్రధానిగా ఎన్నికైన సందర్భంగా మోదీ అభినందించారని, అందుకు ధన్యవాదాలు అని ఆయన పేర్కొన్నారు. భారత్తో తాము శాంతి, సహకారాలనే కోరుకుంటున్నామని పాక్ ప్రధాని స్పష్టం చేశారు. ఇరు దేశాల సాంఘిక, ఆర్థిక అభివృద్ధిపై దృష్టి పెట్టాలని పాక్ ప్రధాని ఆకాంక్షించారు. కశ్మీర్ సమస్య పరిష్కారమైతే.. పేదరికం, నిరుద్యోగం లాంటి సమస్యలపై దృష్టి సారించే ఛాన్స్ ఉందన్నారు. కశ్మీర్తో సహా.. ఇరు దేశాల మధ్య ఎలాంటి వివాదాలున్నా… వాటి పరిష్కారం అత్యావశ్యకమని పాక్ ప్రధాని నొక్కి చెప్పారు.
Thank you Premier Narendra Modi for felicitations. Pakistan desires peaceful & cooperative ties with India. Peaceful settlement of outstanding disputes including Jammu & Kashmir is indispensable. Pakistan's sacrifices in fighting terrorism are well-known. Let's secure peace and.. https://t.co/0M1wxhhvjV
— Shehbaz Sharif (@CMShehbaz) April 12, 2022
పాక్ నూతన ప్రధానిగా ఎన్నికైన షహబాజ్ షరీఫ్ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. శాంతి, సుస్థిరతను భారత్ కోరుకుంటోందని మోదీ పేర్కొన్నారు. ఈ రెండు నెలకొంటేనే.. అభివృద్ధిపై దృష్టి సారించవచ్చని మోదీ అభిప్రాయపడ్డారు.