న్యూఢిల్లీ: ఈ మాటలు అన్నది ఎవరో కాదు. సాక్షాత్తూ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి. ఆఫ్ఘనిస్థాన్లో ప్రస్తుత భయానక పరిస్థితులను చూసినప్పుడే పౌరసత్వ సవరణ చట్టం (CAA) కచ్చితంగా అవసరమన్న విషయం తెలుస్తుందని ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. మన అస్థిరమైన పొరుగుదేశంలో ఈ మధ్య కాలంలో జరుగుతున్న పరిణామాలను చూస్తూనే ఉన్నాం. సిక్కులు, హిందువులు దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అందుకే పౌరసత్వ సవరణ చట్టం అనేది అవసరం అని చెప్పేది అని హర్దీప్ సింగ్ పూరి ట్వీట్ చేశారు.
2019, డిసెంబర్ 11న పార్లమెంట్ ఈ పౌరసత్వ సవరణ చట్టానికి ఆమోదం తెలిపిన విషయం తెలిసింది. ఈ సవరణ ప్రకారం.. 2014, డిసెంబర్ కంటే ముందు మన పొరుగు దేశాలైన ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ల నుంచి వచ్చే హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు లేదా క్రిస్టియన్లకు భారత పౌరసత్వం ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ముస్లింలకు మాత్రం ఇందులో చోటు కల్పించకపోవడంపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.