Padma Awards 2025 | భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం శనివారం పద్మ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ప్రతిష్టాత్మక అవార్డులకు కేంద్రం ఎంపిక చేసింది. అవార్డులకు ఎంపికైన వారిలో ఒకరు విదేశీయులు ఉన్నారు. బ్రెజిల్కు చెందిన వేదాంత గురు జోనస్ మాశెట్టి, కువైట్కు చెందిన షేకా ఏజే అల్ సబాహ్, నేపాల్కు చెందిన నరేన్ గురుంగ్ సైతం పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు.
పద్మ అవార్డులను పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ అనే మూడు కేటగిరిల్లో కేంద్రం అందిస్తుంది. కళలు, సమాజ సేవ, ప్రజా సంబంధాలు, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, వాణిజ్యం, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలతో పాటు వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన వారిని అవార్డులకు ఎంపిక చేస్తారు. ప్రతి ఏటా రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ అవార్డులను ప్రకటిస్తూ వస్తున్నారు.
జోనస్ మాశెట్టి.. బ్రెజిల్, వేదాంత గురువు
షేఖా ఏజే అల్ సబాహ్, కువైట్, యోగా
నరేన్ గురుంగ్, నేపాల్, జానపద గాయకుడు
హర్వీందర్సింగ్, హర్యానా, పారా ఒలింపియన్ గోల్డ్మెడల్ విన్నర్
భీమ్ సింగ్ భవేష్, బిహార్, సామాజిక కార్యకర్త
పీ దక్షిణా మూర్తి, పుదుచ్చేరి, డోలు విద్వాంసుడు
ఎల్ హంగ్థింగ్, నాగాలాండ్, వ్యవసాయం
బేరు సింగ్ చౌహాన్, మధ్యప్రదేశ్, జానపద గాయకుడు
హరిమన్ శర్మ, హిమాచల్ ప్రదేశ్, ఆపిల్ సాగుదారుడు
జుమ్డే యోమ్గామ్ గామ్లిన్, అరుణాచల్ ప్రదేశ్, సామాజిక కార్యకర్త
విలాస్ దాంగ్రే, మహారాష్ట్ర, హోమియోపతి వైద్యుడు
వెంకప్ప అంబానీ సుగటేకర్, కర్ణాటక, జానపద గాయకుడు
నిర్మలా దేవి, బిహార్, చేతి వృత్తులు
రాధా బహిన్ భట్, ఉత్తరాఖండ్, సామాజిక కార్యకర్త
జోయ్నచరణ్ బతారీ, అసోం, థింసా కళాకారుడు
సురేశ్ సోనీ, గుజరాత్, సోషల్వర్కర్
పాండి రామ్ మాండవి, ఛత్తీస్గఢ్, కళాకారుడు
లిబియా లోబో సర్దేశాయ్, గోవా, స్వాతంత్య్ర సమరయోధురాలు
గోకుల్ చంద్రదాస్, పశ్చిమ బెంగాల్, కళలు
సల్లీ హోల్కర్, మధ్యప్రదేశ్, టెక్స్టైల్స్
మారుతీ భుజరంగ్రావు, మహారాష్ట్ర సాంస్కృతికం-విద్య
బతూల్ బేగమ్, రాజస్థాన్, జానపద కళాకారురాలు
వేలు ఆసన్, తమిళనాడు, డప్పు వాద్యకారుడు
భీమవ్వ దొడ్డబాలప్ప శిల్లేక్యాతర, కర్ణాటక, తోలుబొమ్మలాట
పర్మార్ లావ్జీభాయ్ నాగ్జీభాయ్, గుజరాత్, చేనేత
విజయలక్ష్మి దేశ్మానే, కర్ణాటక, వైద్యం
చైత్రం దేవ్చంద్ పవార్, మహారాష్ట్ర, పర్యావరణ పరిరక్షణ