Asaduddin Owaisi : అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ వేడుకల సందర్భంగా జనవరి 22న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్ధలు, వాణిజ్య సంస్ధలకు హాఫ్డే సెలవు ప్రకటించడంపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ మోదీ సర్కార్పై విరుచుకుపడ్డారు. మెజారిటీ ప్రజలను మెప్పించేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు. ఈద్ మిలాడినబీ సెలవును ఓ బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిందని గుర్తుచేశారు.
నమాజ్ కోసం శుక్రవారం 30 నిమిషాల విరామాన్ని లోక్సభ షెడ్యూల్ నుంచి రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధంకర్ ఎత్తివేస్తూ టైం షెడ్యూల్ను మార్చారని అన్నారు. 2017లో యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ 15 పబ్లిక్ హాలిడేలను రద్దు చేయగా అందులో మిలాడినబీ ఉందని అన్నారు. ఇక జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి.
ఈ కార్యక్రమంలో రాజకీయ నేతలు, సెలబ్రిటీలు, వీఐపీలు, పారిశ్రామికవేత్తలు, ఆధ్యాత్మిక వేత్తలు, సన్యాసులు సహా 7000 మందికి పైగా హాజరవుతున్నారని ఆలయ ట్రస్ట్ వర్గాలు వెల్లడించాయి. రామ మందిర గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహాన్ని గురువారం ప్రతిష్టించారు. నాలుగు గంటల పాటు సాగిన పూజాధికాలు, మంత్రోచ్ఛారణ మధ్య 51 అడుగుల బాల రాముడి నల్లరాతి విగ్రహాన్ని ప్రతిష్టించారు.
Read More :
Student | కోచింగ్ క్లాస్లో కుప్పకూలి ప్రాణాలు వదిలిన సివిల్ సర్వీసెస్ విద్యార్థి.. VIDEO