న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని మంచు దుప్పటి కమ్మేసింది. దట్టమైన పొగమంచు (Dense Fog) కురుస్తుండటంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రాబోయే రెండు రోజులు కూడా ఢిల్లీ ఎన్సీఆర్లో దట్టమైన పొగమంచు కనిపించే అవకాశం ఉందని ఐఎండీ (IMD) పేర్కొంది. రాజధాని ప్రాంతంలో కోల్డ్-డే (Cold Day) హెచ్చరికను జారీ చేసింది.
పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్తోపాటు హిమాలయాల్లోని పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో శనివారం ఉందయం భారీగా పొగమంచు కురిసింది. జనవరి 2 వరకు దట్టమైన పొగమంచు కమ్మే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కాగా, పొగమంచు వల్ల ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి రావాల్సిన సుమారు 80 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని అధికారులు వెల్లడించారు. అదేవిధంగా పలు రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయని తెలిపింది.