అహ్మదాబాద్, డిసెంబర్ 1: గుజరాత్ అసెంబ్లీ తొలి విడత ఎన్నికల్లో 60.23 శాతం పోలింగ్ నమోదైంది. 89 అసెంబ్లీ స్థానాలకు సోమవారం పోలింగ్ నిర్వహించారు. 788 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఇంకా తుది వివరాలు రావాల్సి ఉన్నందున పోలింగ్ శాతం పెరిగే అవకాశమున్నది.
కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మరికొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో వాటిస్థానాల్లో కొత్తవాటిని ఏర్పాటు చేశారు. లింబ్డి నియోజకవర్గంలోని సామ్లా గ్రామంలో పోలింగ్ బూత్ను కొందరు స్వాధీనం చేసుకున్నారని, బోగస్ ఓటింగ్కు పాల్పడ్డారని కాంగ్రెస్ ఆరోపించింది.