Sexual Harassment | విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ప్రిన్సిపల్ (Principal) కీచకుడయ్యాడు. పాఠశాలలోని సుమారు 50 మంది విద్యార్థినుల ( Schoolgirls)పై లైంగిక వేధింపులకు (Sexual Harassment) పాల్పడ్డాడు. ఈ ఘటన హర్యానా రాష్ట్రం జింద్ జిల్లా (Jind district)లో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై విద్యార్థులే స్వయంగా ఫిర్యాదు చేయడం కలకలం రేపింది.
జింద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 50 మంది విద్యార్థినులపై ప్రిన్సిపల్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. స్వయంగా బాధిత విద్యార్థులే ప్రిన్సిపల్పై ఫిర్యాదు చేశారు. అయితే, ఈ విషయంలో పోలీసులు అలసత్వం ప్రదర్శించడం పట్ల హర్యానా రాష్ట్ర మహిళా కమిషన్ (Haryana State Commission for Women) ఆగ్రహం వ్యక్తం చేసింది. పాఠశాల విద్యార్థినుల ఫిర్యాదులను తాము సెప్టెంబర్ 14వ తేదీన పోలీసులకు పంపినట్లు తెలిపింది. అయితే అక్టోబర్ 30న చర్యలు తీసుకున్నట్లు కమిషన్ పేర్కొంది. ఫిర్యాదు చేసిన నెలన్నర తర్వాత ప్రిన్సిపల్పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించింది.
ఈ మేరకు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రేణు భాటియా మాట్లాడుతూ.. ‘ప్రిన్సిపల్పై విద్యార్థినుల నుంచి మాకు 60 లిఖితపూర్వక ఫిర్యాదులు అందాయి. వీటిలో 50 మంది విద్యార్థులు నేరుగా ప్రిన్సిపల్ చేతిలో శారీరక వేధింపులకు గురైన వారే. మరో పది మంది అమ్మాయిలు ప్రిన్సిపల్ ఇలాంటివి (లైంగిక వేధింపులు) చేస్తారని తమకు తెలుసునని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు’ అని ఆమె వివరించారు. ఫిర్యాదు చేసిన వారంతా మైనర్లని భాటియా తెలిపారు. ఈ విషయంలో పోలీసుల తీరుపై భాటియా మండిపడ్డారు. కొంతమంది విద్యార్థినుల నుంచి సెప్టెంబర్ 13న ఫిర్యాదును స్వీకరించినట్లు చెప్పారు. ఆ తర్వాతి రోజు అంటే సెప్టెంబర్ 14న పోలీసులకు ఫార్వర్డ్ చేసినట్లు చెప్పారు. అయితే, సెప్టెంబర్ 14 నుండి అక్టోబర్ 29 వరకు వారు ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Also Read..
Mukesh Ambani | అంబానీకి బెదిరింపు మెయిల్ కేసు.. తెలంగాణకు చెందిన వ్యక్తి అరెస్ట్
Earthquake | ప్రజలు అప్రమత్తంగా, సిద్ధంగా ఉండండి.. నేపాల్ భూకంపం వేళ నిపుణుల హెచ్చరిక
Diwali Gift | ఉద్యోగులకు అదిరిపోయే దివాళి గిఫ్ట్.. కార్లను బహుమతిగా ఇచ్చిన ఫార్మా సంస్థ యజమాని