Mukesh Ambani | రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ (Mukesh Ambani)కి హత్య బెదిరింపు మెయిల్స్ (Death Threats) కేసులో ఓ వ్యక్తిని ముంబై పోలీసులు శనివారం అరెస్ట్ (Man Arrested ) చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచినట్లు గాందేవి పోలీసులు (Gamdevi police) తెలిపారు. అతడికి కోర్టు నవంబర్ 8వ తేదీ వరకు రిమాండ్ విధించినట్లు వెల్లడించారు. నిందితుడు తెలంగాణకు చెందిన 19 ఏళ్ల గణేష్ రమేష్ వనపర్థి (Ganesh Ramesh Vanpardhi)గా గుర్తించారు.
ముఖేశ్ అంబానీకి వరుస బెదిరింపు మెయిల్స్ కలకలం రేపిన విషయం తెలిసిందే. నాలుగు రోజుల్లోనే ఏకంగా మూడు సార్లు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. అక్టోబర్ 27, 28 తేదీల్లో అంబానీకి బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు తెలిసిందే. ముందుగా 27వ తేదీన రూ.20 కోట్లు డిమాండ్ చేసిన దుండగులు.. ఆ తర్వాతి రోజు దాని రేటును రూ.200 కోట్లకు పెంచేశారు. ఆ తర్వాత సోమవారం (అక్టోబర్ 30) న దాన్ని డబుల్ చేసి రూ.400 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. తాము అడిగినంత ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించారు. ఈ మూడు బెదిరింపులు ఒకే ఈ మెయిల్ ఐడీ నుంచి వచ్చినట్లు ముంబై పోలీసులు తెలిపారు. ఆ తర్వాత అక్టోబర్ 31 నవంబర్ 1వ తేదీ మధ్య మరో మెయిల్ కూడా పంపారు. అడిగినంత ఇవ్వకపోతే అంబానీని చంపేస్తామని.. తమ వద్ద ఉన్న అత్యుత్తమ షూటర్లు అంబానీని కాల్చేస్తారని బెదిరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు తాజాగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
#UPDATE | Mumbai | One accused arrested from Telangana for allegedly sending multiple threat emails to industrialist Mukesh Ambani.
Gamdevi police say that the accused identified as Ganesh Ramesh Vanpardhi was arrested and produced before the court and remanded to police custody…
— ANI (@ANI) November 4, 2023
Also Read..
Diwali Gift | ఉద్యోగులకు అదిరిపోయే దివాళి గిఫ్ట్.. కార్లను బహుమతిగా ఇచ్చిన ఫార్మా సంస్థ యజమాని
Earthquake | ప్రజలు అప్రమత్తంగా, సిద్ధంగా ఉండండి.. నేపాల్ భూకంపం వేళ నిపుణుల హెచ్చరిక