చెన్నై: స్కూల్ సెప్టిక్ ట్యాంక్ నుంచి గ్యాస్ లీకైంది. దీంతో వంద మందికిపైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తమిళనాడులోని హోసూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. హోసూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం మధ్యాహ్నం 3.45 గంటలకు స్కూల్ ప్రాంగణంలోని సెప్టిక్ ట్యాంక్ నుంచి విష వాయువులు వెలువడ్డాయి. దీంతో స్కూల్కు చెందిన సుమారు వంద మంది విద్యార్థులు అస్వస్థత చెందారు. తరగతి గదుల్లో వాంతులు చేసుకున్నారు. దీంతో విద్యార్థులను హుటాహుటిన తొలుత సమీప ఆసుపత్రికి అనంతరం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
ఈ విషయం తెలిసిన వెంటనే హోసూర్ జిల్లా కలెక్టర్ జయ చంద్ర భాను రెడ్డి ఆ స్కూల్తోపాటు విద్యార్థులు చికిత్స పొందుతున్న ఆసుపత్రిని సందర్శించారు. 67 మంది విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. అయితే ఎవరి ఆరోగ్య పరిస్థితి సీరియస్గా లేదని చెప్పారు. విష వాయువుల లీకేజీపై హోసూర్ కార్పొరేషన్, కాలుష్య నియంత్రణ సంస్థతో దర్యాప్తు జరుపుతామని వెల్లడించారు.
మరోవైపు విద్యా శాఖ అధికారులతోపాటు పోలీసులు కూడా ఆ స్కూల్ను పరిశీలించారు. విష వాయువులు సెప్టిక్ ట్యాంక్ నుంచా లేక సమీపంలోని ఫ్యాక్టరీ నుంచి వెలువడ్డాయా అన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు.
Hosur, TN | More than 60 students of Govt Middle School were rushed to hospital after they complained of vomiting, earlier today
67 students received treatment at the hospital, none in serious condition. Hosur Corporation & Pollution Control Board probing reason: DC Krishnagiri pic.twitter.com/0LEzlwZZCX
— ANI (@ANI) October 14, 2022