Mann Ki Baat | ఛత్తీస్గఢ్: ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’ విననందుకు నర్సింగ్ విద్యార్థినులు వారం పాటు ఔటింగ్ (విహారం) వెళ్లేందుకు నిరాకరిస్తూ అధికారులు నోటీసులు జారీ చేశారు. జాతీయ నర్సింగ్ సంస్థ(నైన్)కు చెందిన విద్యార్థినులు మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ను తప్పనిసరిగా వినాలని వైద్య విద్య, పరిశోధన స్నాతకోత్తర సంస్థ(పీజీఐఈఎం) దవాఖాన అధికారులు ఆదేశించారు.
36 మంది విద్యార్థినులు ఆదేశాలను పాటించలేదు. దీంతో వారం పాటు విహార యాత్రకు వెళ్లొద్దని వారికి అధికారులు ఈనెల 3న నోటీస్ ఇచ్చారు. ప్రిన్సిపాల్ సుఖ్పాల్ కౌర్ను వివరణ కోరగా పీఈఐఎంఈఆర్ అధికారులు స్పందిస్తారని సమాధానమిచ్చారు.