తిరువనంతపురం: కేరళలో కుండపోత వర్షాలు పడుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కుంభవృష్టి కురుస్తున్నది. దాంతో పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పోటెత్తిన వరదలవల్ల ఇప్పటికే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పలు ప్రాంతాలు నీట మునిగడంతో ఆయా ప్రాంతాల జనాన్ని రెస్క్యూ టీమ్లు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి.
ఇదిలావుంటే కేరళలో మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం (IMD) హెచ్చరించింది. రాష్ట్రంలోని మొత్తం 14 జిల్లాలకుగాను 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. అత్యంత భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న ఇడుక్కి జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇతర జిల్లాలతో పోల్చితే వర్ష ప్రభావం తక్కువగా ఉన్న కొల్లామ్, తిరువనంతపురం జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీచేసింది.
Heavy rain continues in Kerala; widespread damage reported. #Keralarains pic.twitter.com/Jah5HcE8by
— All India Radio News (@airnewsalerts) July 5, 2023
Heavy rain with cyclone, thunder, lightning and hail at vellikkulangara in Thrissur district in Kerala, India, 25-March-2023 evening#cyclone #storm #kerala #summer #rain @Arab_Storms @mzinelsawari @mdar_aljadi pic.twitter.com/ycCvgtjWMX
— Kerala Rain Forecaster (@sajjadholding) March 25, 2023