ఐజ్వాల్: మిజోరం అసెంబ్లీ ఎన్నికల (Mizoram Assembly Elections) ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. తొలు పోస్టల్ ఓట్లను లెక్కించగా, ప్రస్తుతం ఈవీఎం ఓట్ల కౌంటింగ్ జరుగుతున్నది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. ప్రతిపక్ష జోరం పీపుల్స్ మూవ్మెంట్ (ZPM) పార్టీ పూర్తిస్థాయి మెజార్టీ దిశగా దూసుకెళ్తున్నది. ఇప్పటికే ఒక చోట గెలుపొందిన జడ్పీఎం మరో 25 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నది. ఇక సీఎం జొరాంతంగా (CM Zoramthanga) నేతృత్వంలోని అధికార మిజో నేషనల్ ఫ్రంట్ (MNF) 9 స్థానాల్లో ముందంజలో ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 2 స్థానాల్లో, బీజేపీ 3 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి.
40 స్థానాలున్న మిజోరం అసెంబ్లీకి నవంబర్ 7న ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో 80.66 శాతం ఓటింగ్ నమోదయింది. మొత్తం 174 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఈ నెల 3న ఫలితాలు వెలువడాల్సి ఉన్నప్పటికీ ప్రజల కోరిక మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నేటికి వాయిదా వేసింది.
#MizoramElections2023 | Official EC trends of all 40 seats in – ZPM (Zoram People’s Movement) comfortably crosses the halfway mark, wins 1 and leads on 25 seats.
Ruling MNF (Mizo National Front) leads on 9 seats
BJP on 3
Congress on 2 pic.twitter.com/w2zT3I7sVc— ANI (@ANI) December 4, 2023