Poll Schedule : లోక్సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్పై విపక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏప్రిల్ 19 మొదలుకుని ఏడు దశల్లో లోక్సభ ఎన్నికల నిర్వహణపై ఈసీ ప్రకటించిన షెడ్యూల్ బీజేపీకి మేలు చేసే విధంగా ఉందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే దుయ్యబట్టారు. సుదీర్ఘంగా ఏడు దశల్లో లోక్సభ ఎన్నికల పోలింగ్ చేపట్టడంతో ప్రధాని నరేంద్ర మోదీ దేశ వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేసుకునే వెసులుబాటు కలిగిందని అన్నారు.
లోక్సభ ఎన్నికల షెడ్యూల్ బీజేపీకి మేలు చేస్తుందని, కాషాయ పార్టీ ప్రచారానికి వీలు కల్పించేలా ఉందని విపక్షం భగ్గుమంది. లోక్సభ ఎన్నికలను మూడు, నాలుగు దశల్లో పూర్తి చేయాలని ఖర్గే పేర్కొన్నారు. ప్రస్తుత షెడ్యూల్తో ప్రభుత్వ కార్యక్రమాలు, పనులన్నీ జూన్ 4 వరకూ నిలిచిపోతాయని ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు.
ఇక బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకే ఏడు దశల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారని సీపీఐ నేత డీ రాజా ఆరోపించారు. జమ్ము కశ్మీర్లో ఉద్దేశపూర్వకంగానే ఎన్నికల నిర్వహణలో జాప్యం చేస్తున్నారని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రవీంద్ర శర్మ అన్నారు. కశ్మీర్లో సాధారణ స్ధితి నెలకొందని చెబుతున్న ప్రభుత్వం మరి అక్కడ ఎందుకు ఎన్నికల నిర్వహణలో జాప్యం చేస్తోందని ప్రశ్నించారు.
Read More :
Indian Citizenship | గుజరాత్లో 18 మంది పాక్ హిందూ శరణార్థులకు భారత పౌరసత్వం