న్యూఢిల్లీ : విపక్ష ఇండియా కూటమికి చెందిన పలువురు నేతలు రాజ్యసభలో అధికార పక్ష నాయకుడైన పీయూష్ గోయల్పై మంగళవారం సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చారు. ‘న్యూస్ క్లిక్’ పోర్టల్కు చైనా సంస్థల నుంచి నిధులు వస్తున్నాయని ఆరోపిస్తూ.. ప్రతిపక్ష నేతలందరినీ గోయల్ ద్రోహులుగా పేర్కొన్నారని కూటమి నేతలు రాజ్యసభ చైర్మన్కు ఫిర్యాదు చేశారు.
గోయల్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సభలో క్షమాపణ చెప్పడానికి పీయూష్ గోయల్ నిరాకరించారని కాంగ్రెస్ ఎంపీ జైరామ్ రమేశ్ ట్వీట్ చేశారు. నోటీస్పై గోయల్ స్పందిస్తూ.. చట్టసభలో ఉపయోగించకూడని పదాలు ఏమైనా తన వ్యాఖ్యల్లో ఉంటే వాటిని రికార్డుల నుంచి తొలగించాలని రాజ్యసభ చైర్మన్ను కోరారు.