బెంగళూర్ : కర్నాటక రాజధాని బెంగళూర్లో విపక్షాల భేటీలో (Opposition Meeting) రెండో రోజు మంగళవారం పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని దీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన వ్యూహాలను ఈ భేటీలో ఖరారు చేయనున్నారు. సమిష్టిగా తీసుకోవాల్సిన అంశాలపై బ్లూప్రింట్ తయారుచేసేందుకు కమిటీ ఏర్పాటు కానుంది.
కనీస ఉమ్మడి కార్యక్రమం స్ధానంలో లేవనెత్తాల్సిన ఉమ్మడి అంశాలను గుర్తించి జాబితా రూపొందించేందుకు కమిటీని నియమించే అవకాశం ఉంది. ఇక యూపీఏ పేరు మార్పు విషయంలోనూ విపక్షాల సమావేశంలో నేతలు కసరత్తు సాగిస్తున్నారు. నాలుగైదు పేర్లను పరిశీలిస్తున్న నేతలు నేడు నూతన కూటమి పేరును ప్రకటించే అవకాశం ఉంది. కూటమి పేరులో ఫ్రంట్ అనే పదం వాడరాదని టీఎంసీ సూచించింది.
ఇక బెంగళూర్లో విపక్ష సమావేశం రెండో రోజు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, డీఎంకె ఎంపీ టీఆర్ బాలు హాజరయ్యారు. సమావేశానికి ముందు కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ మృతికి నేతలు సంతాపం ప్రకటించారు. దివంగత నేత మృతికి సంతాపంగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించామని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. సమావేశం అనంతరం విపక్షాల భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలను నేతలు విలేకరుల సమావేశంలో వెల్లడించనున్నారు.
Read More :
Jharkhand | పోలీసులపై క్రిమినల్ గ్యాంగ్ కాల్పులు.. ఏటీఎస్ డీఎస్పీ, ఎస్ఐకి తీవ్ర గాయాలు