రాంచీ: జార్ఖండ్లో (Jharkhand) రామ్గఢ్ జిల్లాలో నేరస్థులను పట్టుకోవడానికి వెళ్లిన ఉగ్రవాద నిరోధక బృందంపై (ATS) దుండగులు కాల్పులకు తెగబడ్డారు. పాత నేరస్థులైన అమన్ సాహు గ్యాంగ్ను (Aman Sahu Gang) అరెస్టు చేయడానికి ఏటీఎస్ డీఎస్పీ నీరజ్ కుమార్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం రామ్గఢ్ (Ramgarh) జిల్లాలోని పట్రాటు (Patratu) ప్రాంతంలో దాడులు నిర్వహించింది. ఈ క్రమంలో ఆ గ్రూప్లోని ఇద్దరు నేరగాళ్లు ఏటీఎస్ బృందంపై కాల్పులు జరిపారు. అనంతరం బైక్పై అక్కడినుంచి పరారయ్యారు.
దీంతో డీఎస్పీ నీరజ్ కుమార్ (ATS DSP Neeraj Kumar ), ఎస్సై సోను తీవ్రంగా గాయపడ్డారు. తోటి సిబ్బంది వారిని హుటాహుటిన రాంచీలోని (Ranchi) దవాఖానకు తరలించారు. అయితే డీఎస్పీ నీరజ్ పరిస్థితి విషమంగా ఉందని రామ్గఢ్ ఎస్పీ పియూష్ పాండే (SP Piyush Pandey) తెలిపారు. అమన్ సాహూ గ్యాంగ్ను అరెస్టుచేయడానికి రాంచీ ఏటీఎస్, రామ్గఢ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకున్నట్లు వెల్లడించారు.
#WATCH | SP Ramgarh Piyush Pandey says "Teams of ATS Ranchi and Ramgarh Police had come here for a raid to arrest the criminals of Aman Sahu Gang. After spotting the police, the criminals opened fire on them in Patratu area of Ramgarh district. In this encounter, ATS DSP Neeraj… pic.twitter.com/NXxDZIG4X1
— ANI (@ANI) July 17, 2023