న్యూఢిల్లీ: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం (Hamas) రోజురోజుకు తీవ్రతరమవుతున్నది. దీంతో యుద్ధభూమి నుంచి భారతీయులను స్వదేశానికి తరలిస్తున్నది. దీనికోసం ఆపరేషన్ అజయ్ (Operation Ajay) కార్యక్రమాన్ని మూడు రోజుల క్రితం ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇజ్రాయెల్ (Israel) నుంచి మొదటి విమానం శుక్రవారం ఉదయం ఢిల్లీలో ల్యాండ్ అయింది. తాజాగా మరో విమానం దేశ రాజధానిలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. ఈ సందర్భంగా ప్రయాణికులు పెద్దఎత్తున వందేమాతరం నినాదాలు చేశారు.
ఈ నెల 6న పాలస్తీనాలోని గాజా నుంచి హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ పట్టణాలపై దాడులకు దిగారు. 20 నిమిషాల్లో 5 వేలకుపైగా రాకెట్లతో హమాస్ విరుచుకుపడింది. ప్రతిగా ఇజ్రాయెల్ సైన్యం రంగంలోకి దిగింది. హమాస్ను నామరూపాల్లేకుండా చేయాలనే లక్ష్యంతో దూసుకుపోతున్నది. దీంతో ఇరువైపుల భారీగా ప్రాణ ఆస్తి నష్టం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో యుద్ధ క్షేత్రంలో చిక్కుకుపోయిన భారతీయులను కేంద్ర ప్రభుత్వం స్వదేశానికి క్షేమంగా తరలిస్తున్నది.
#WATCH | MoS MEA Rajkumar Ranjan Singh interacts with the Indian nationals evacuated from Israel.
The second flight carrying 235 Indian nationals from Israel, arrived in Delhi today. pic.twitter.com/vLPuN06F6X
— ANI (@ANI) October 14, 2023
#WATCH | Chants of ‘Vande Mataram’ by passengers on the second flight carrying 235 Indian nationals from Israel. The flight landed at Delhi airport today
(Video Source: Passenger) pic.twitter.com/gAf8dkRocN
— ANI (@ANI) October 14, 2023