దుబాయ్, అక్టోబర్ 5: దుబాయ్లో ఆధ్యాత్మిక నిలయమైన జీబెల్ అలీ గ్రామంలో హిందువుల ఆలయాన్ని ప్రారంభించారు. ఈ గ్రామంలో ఏడు చర్చిలు, ఒక గురుద్వారా ఉండగా.. తాజాగా హిందూ ఆలయం కూడా భక్తులకు అందుబాటులోకి వచ్చింది. ఆలయం ప్రారంభం సందర్భంగా భక్తుల కరతాల ధ్వనులు, డప్పు చప్పులతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. ఈ కార్యక్రమంలో దుబాయ్ మంత్రి షేక్ నయాన్ బిన్ ముబారక్, యూఏఈలోని భారత రాయబారి సంజయ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.