న్యూఢిల్లీ, అక్టోబర్ 6: దేశంలో ప్రస్తుతం పెద్దవారిలో 7 శాతం మంది మాత్రమే కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలంటే భయపడుతున్నారని ఒక సర్వేలో వెల్లడైంది. ఇప్పటి వరకు దేశంలో ఇదే అతి తక్కువ శాతమని తెలిపింది. లోకల్సర్కిల్స్ అనే ఆన్లైన్ కమ్యూనిటీ ప్లాట్ఫాం ఈ సర్వేను నిర్వహించింది. ఇందులో భాగంగా 301 జిల్లాలకు చెందిన 12,810 మందికి ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టింది. వీరిలో 67 శాతం మంది పరుషులు, 33 శాతం మంది మహిళలు ఉన్నారు.