న్యూఢిల్లీ: భారతి ఎయిర్టెల్ వ్యవస్థాపకుడు సునిల్ భారతి మిట్టల్(Sunil Bharti Mittal) ఇవాళ ఢిల్లీలో జరిగిన 7వ ఇండియా మొబైల్ కాంగ్రెస్లో మాట్లాడారు. దేశ ప్రజలకు ఇప్పుడు కొత్త టెక్నాలజీ అందుబాటులో ఉందన్నారు. దేశంలోని ప్రతి అంగుళం సేవలు అందించేందుకు శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థ అందుబాటులో ఉందన్నారు. ప్రపంచ దేశాలకు కూడా మన శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థ చేరుకుంటోందన్నారు. జీఎస్ఎల్వీ మాక్ 3 రాకెట్లను ఇస్రో ప్రయోగించిందని, ఆ రాకెట్ ద్వారా 72 ఉపగ్రహాలను నింగిలోకి పంపామని, వన్వెబ్ కాన్స్టెల్లేషన్లోనూ భారతి కంపెనీ వాటా ఉందని, దేశానికి, ప్రపంచానికి సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సునిల్ మిట్టల్ తెలిపారు.
#WATCH | Delhi: Chairman of Bharti Enterprises and founder of Bharti Airtel Sunil Bharati Mittal at the 7th edition of the India Mobile Congress 2023 says, “A new technology is now available for our country. Satellite communication is here to serve every inch of our country and… pic.twitter.com/fHbsqUjOJY
— ANI (@ANI) October 27, 2023
దేశంలో ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా సరే.. వచ్చే నెల నుంచి ఆ ప్రదేశాలకు మెహసానా శాటిలైట్ గ్రౌండ్ స్టేషన్ నుంచి సేవలు అందుతాయని సునిల్ మిట్టల్ తెలిపారు. భారత్ నిర్మించిన డిజిటల్ వ్యవస్థ ప్రపంచ ఆర్థిక స్థితిని మార్చేస్తోందన్నారు. వరల్డ్ బ్యాంక్, యూఎన్, డబ్ల్యూటీవో, ఆఫ్రికా యూనియన్, యురోపియన్ యూనియన్, జీ20, బ్రిక్స్ దేశాలు కూడా భారత డిజిటల్ విధానాన్ని మెచ్చుకుంటున్నట్లు చెప్పారు.
ఆదిత్య బిర్లా గ్రూపు చైర్మెన్ కుమార మంగళం బిర్లా మాట్లాడుతూ.. వోడాఫోన్-ఐడియా తమ వ్యాపార పరిధిని పెంచుకుంటోందన్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ను ఇవాళ ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇండియాలో పిక్సెల్ ఫోన్ను తయారీ చేయనున్నట్లు ఇటీవల గూగుల్ సంస్థ ప్రకటించిందని ప్రధాని మోదీ తెలిపారు. శాంసంగ్ ఫోల్డ్ 5 మొబైల్ ఫోన్, యాపిల్ ఐఫోన్ 15 ఇప్పటికే ఇండియాలో తయారు అవుతున్నాయని, దేశ ప్రజలు ఇప్పుడు గర్వంగా ఫీలవుతున్నారని, ఎందుకంటే మేడిన్ ఇండియా ఫోన్లనే ప్రపంచ ప్రజలు వాడుతున్నారని ప్రధాని మోదీ అన్నారు. మొబైల్ కాంగ్రెస్ సదస్సులోనే దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 100 5జీ ల్యాబ్లను మోదీ ప్రారంభించారు.