Luxembourg | న్యూఢిల్లీ : ప్రపంచంలోని సంపన్న దేశాల్లో ఒకటి యూరోపియన్ యూనియన్ (ఈయూ)లోని లగ్జెంబెర్గ్. ఈ దేశ ప్రజలు ఈయూలో అత్యంత సంపన్నుల క్యాటగిరీలోకి వస్తారు. అలాంటివారు సైతం ఇంటి కిరాయిని భరించలేక జర్మనీ, బెల్జియం, ఫ్రాన్స్ దేశాలకు వెళ్లిపోతున్నారు. 6.60 లక్షల జనాభాగల గ్రాండ్ డచీ లో ఈ సమస్య తీవ్రత అధికంగా ఉంది. రెండు గదుల ఇంటిని కిరాయికి తీసుకోవాలంటే కనీసం 2,000 యూరోలు ఖర్చు చేయాల్సి వస్తున్నదని లగ్జెంబర్గర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కుటుంబంలో సంపాదించే వ్యక్తి ఒకరే అయినపుడు ఈ భారాన్ని మోయలేకపోతున్నట్టు తెలిపారు. యువత, సింగిల్ పేరెంట్స్ చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. 2022 జూన్ – 2023 జూన్ మధ్య కాలంలో అద్దెలు 6.7శాతం పెరిగిపోయాయి. ఎన్నికల సమయంలో కేవలం ఇళ్ల అద్దెల సమస్య మాత్రమే ప్రధానంగా కనిపిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.