షిమ్లా: హిమాచల్ ప్రదేశ్ పర్యాటకులతో కిటకిటలాడుతోంది. ఇయర్ ఎండ్ సెలబ్రేషన్స్ కోసం షిమ్లా(Shimla)కు టూరిస్టులు పోటెత్తుతున్నారు. క్రిస్మస్ సెలవులను సెలబ్రేట్ చేసేందుకు సుమారు లక్షన్నర టూరిస్టులు షిమ్లాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక న్యూ ఇయర్ వేడుకలను కూడా సెలబ్రేట్ చేసుకునేందుకు భారీ సంఖ్యలో టూరిస్టులు వస్తారని ఆశిస్తున్నారు. సుమారు 80 వేల నుంచి లక్ష మంది వరకు టూరిస్టులు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం షిమ్లాకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు స్థానిక పోలీసు అధికారి వెల్లడించారు. ఇయర్ ఎండ్ వేళ సుమారు రెండున్నర లక్షల వాహనాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఎస్పీ సంజీవ్ కుమార్ గాంధీ తెలిపారు. గడిచిన పది రోజుల్లో లక్షా 60 వేల వాహనాలు షోగి రూట్లో వచ్చినట్లు ఆయన చెప్పారు.