ముంబై: ఒక భవనం కూలిన ఘటనలో ఒకరు మరణించగా ఇద్దరు గాయపడ్డారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ ఘటన జరిగింది. కండివాలి ప్రాంతంలో శనివారం సాయంత్రం పురాతన బిల్డింగ్ కూలిపోయింది. దీంతో రెస్క్యూ, అగ్నిమాపక బృందాలు సంఘటనా స్థలానికి వెళ్లాయి. సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాలను తొలగించే పనిలో నిమగ్నమయ్యాయి.
కాగా, ఈ ఘటనలో ఒకరు చనిపోగా, ఇద్దరు గాయపడినట్లు అధికారులు తెలిపారు. శిథిలాల కింద కొందరు చిక్కుకుని ఉండవచ్చని అనుమానిస్తున్నారు. స్థానిక అధికారులు, పోలీసులు అక్కడి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.