Covid Vaccine | కరోనా మహమ్మారి వల్ల మరణాలను నివారించడంలో వ్యాక్సిన్లు సమర్థవంతంగా పని చేస్తున్నాయి. సింగిల్ డోస్తో 96.6 శాతం, రెండు డోస్లతో 97.5 శాతం మరణాలను నివారించగల సామర్థ్యం ఉంటుందని కేంద్రం తెలిపింది. కనుక వ్యాక్సిన్ తీసుకున్నాక మహమ్మారి భారీన పడినా ముప్పు తక్కువేనని భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) చీఫ్ బలరాం భార్గవ చెప్పారు.
గత ఏప్రిల్ 18 నుంచి ఆగస్టు 15 వరకు సేకరించిన డేటా ప్రకారం కరోనా మహమ్మారి మరణాలను వ్యాక్సిన్లు నివారిస్తున్నాయని తేలిందని బలరాం భార్గవ చెప్పారు. అన్ని వయస్సుల వారికి వ్యాక్సిన్ల నుంచి రక్షణ లభిస్తున్నదని చెప్పారు. సెకండ్ వేవ్లో మృత్యువాత పడిన వారిలో అత్యధికులు వ్యాక్సిన్ వేసుకోని వారేనన్నారు. కనుక అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు.
18 ఏండ్ల దాటిన వారిలో 58 శాతం మందికి కనీసం సింగిల్ డోస్ వ్యాక్సిన్ వేసినట్లు కోవిడ్-19 టాస్క్ఫోర్స్ చీఫ్ డాక్టర్ వీకే పాల్ చెప్పారు. మిగతా వారికి వ్యాక్సినేషన్ పూర్తయితేనే హెర్డ్ ఇమ్యూనిటీ సాధించగలమని స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి వేళ డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. డెంగ్యూ జ్వరం వల్లే ఉత్తరప్రదేశ్లో పిల్లలు మరణిస్తున్నారని చెప్పారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Tesla HatchBach Affordable| 2023లో చౌకగా హ్యాచ్బ్యాక్ టెస్లా కారు.. ధరెంతంటే?!
Ola vs Tesla | టెస్లాకు ముందే అమెరికాలోకి ఓలా స్కూటర్ ఎంట్రీ.. ?!