బెంగళూరు, మే 2(నమస్తే తెలంగాణ ప్రతినిధి): జంట హత్యల కేసులో నిందితుడు, రౌడీషీటర్ ముద్దుకృష్ణ ఇటీవల ఓ బహిరంగ వేదికపై ప్రధాని మోదీని సత్కరించటం చర్చనీయాంశమైంది. ఎన్నికల ప్రచారం నిమిత్తం రామ్నగర జిల్లా చెన్నపట్నకు వచ్చిన ప్రధాని మోదీ మెడలో ముద్దుకృష్ణ పూలహారం వేసి, శిరస్సుపై ప్రత్యేకమైన తలపాగాను పెట్టారు.
సంఘవిద్రోహిగా ముద్రపడ్డ ముద్దుకృష్ణతో కలసి ఒకే వేదికను ప్రధాని పంచుకోవటం వార్తల్లో నిలిచింది. ‘ప్రధాని పదవి, హోదాను మోదీ మట్టిపాల్జేశారు. ముద్దుకృష్ణ ఎవ్వరో తెలియకుండానే అంత సన్నిహితంగా మెలగటమేంటి?’ అనే విమర్శలు వెలువడుతున్నాయి.