అమృత్సర్: భారత్, పాక్ సరిహద్దుల్లో తరచూ పాకిస్థాన్ డ్రోన్ల కదలికలు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా పంజాబ్లోని తారన్ తరన్ జిల్లాలో పాకిస్థాన్ సరిహద్దు వెంబడి ఓ డ్రోన్ సంచరిస్తుండటాన్ని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కు చెందిన జవాన్లు గుర్తించారు.
వెంటనే ఆ డ్రోన్ను అడ్డగించగా దాన్ని వెనక్కి తీసుకెళ్లారు. అనంతరం ఘటనా ప్రాంతంలో జవాన్లు తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీలో కాలియా గ్రామం పరిధిలో ఒక రెండున్నర కేజీల ప్యాకెట్ లభ్యమైంది. ఆ ప్యాకెట్లో హెరాయిన్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ సరిహద్దుల గుండా భారత్లోకి ప్రవేశపెడుతున్న పాకిస్థాన్.. ఇక్కడ వారు పంపిన ఉగ్రవాదుల అవసరాలను తీర్చడానికి డ్రోన్లను వినియోగిస్తున్నట్లు సమాచారం. పంజాబ్ యువతను మత్తుకు బానిసలుగా చేయాలనే కుట్రతో కూడా పాకిస్థాన్ డ్రోన్ల ద్వారా ఇక్కడికి డ్రగ్స్ను సరఫరా చేస్తున్నట్లు జవాన్లు అనుమానిస్తున్నారు.