న్యూఢిల్లీ, జనవరి 1: కొత్త సంవత్సరం తొలిరోజే కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను రూ.25 పెంచింది. దీంతో వాణిజ్య సిలిండర్ ధర ఢిల్లీలో రూ.1,769, ముంబైలో రూ.1,721, కోల్కతాలో రూ.1,870, చెన్నైలో 1,971కు పెరిగింది. గృహ వినియోగ సిలిండర్ల ధరలో మార్పు లేదు. చివరిసారిగా 2022 జూలై 6న ఆయిల్ కంపెనీలు గృహ వినియోగ సిలిండర్ ధర పెంచాయి. గత ఏడాది నాలుగుసార్లు ధరలను పెంచాయి.