Speeding Truck | మహారాష్ట్ర పూణే (Pune)లో ఓ ట్రక్కు బీభత్సం (Speeding Truck) సృష్టించింది. రోడ్డుపై అతివేగంగా వెళ్తున్న క్రమంలో అదుపుతప్పి ( loses control) పలు వాహనాలపైకి దూసుకెళ్లింది (rams vehicles). ఈ ఘటనలో సుమారు ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. పూణేలోని పిరంగట్ ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఇటుకలు, సిమెంట్ లోడుతో ఓ ట్రక్కు పిరంగట్ ఘాట్ మీదుగా అతివేగంగా దూసుకెళ్తోంది. ఈ క్రమంలో అదుపుతప్పి ముందుగా ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఆ తర్వాత ఓ కారుపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో డ్రైవర్ సహా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఒక కారు, ఐదు ద్విచక్ర వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్ను యూపీకి చెందిన 27 ఏళ్ల గోవింద్ లాల్గా గుర్తించారు. క్షతగాత్రులను డ్రైవర్ గోవింద్ లాల్, మంగేష్ గైక్వాడ్, భజరంగ్ మజిరే, పూనమ్ మజిరే, లలిత్ పాటిల్, శ్రీకాంత్ వాగ్మారే, హంసరాజ్ హీరాలాల్ గౌతమ్గా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్క సీసీటీవీ ఫుటేజ్లో రికార్డయ్యాయి.
#Pune | In an unfortunate incident in the Pirangut area, a speeding cargo truck collided with five to six vehicles, resulting in injuries to seven people, including the tempo driver.#Accident #Maharashtra pic.twitter.com/b1EmzYfpS3
— Free Press Journal (@fpjindia) November 21, 2023
Also Read..
RamNath Kovind | జమిలితో ప్రజలకే ప్రయోజనం : రామ్నాథ్ కోవింద్
Aanand Mahindra | షాకింగ్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా.. ఇది నిజమేనా? అంటూ ప్రశ్న