లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మఠాధిపతిగా ఉన్న గోరఖ్నాథ్ ఆలయం వద్ద ముస్లిం వ్యక్తి హంగామా సృష్టించాడు. అక్కడ సెక్యూరిటీగా ఉన్న పోలీసులు అతడ్ని అడ్డుకోబోగా కొడవలితో వారిపై దాడి చేసేందుకు యత్నించాడు. ఈ ఘటనలో ఆ వ్యక్తితోపాటు ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. గోరఖ్పూర్ నివాసి అయిన అహ్మద్ ముర్తజా అబ్బాసీ ఆదివారం రాత్రి 7 గంటలకు గోరఖ్నాథ్ ఆలయం వద్దకు వచ్చాడు. మతపరమైన నినాదాలు చేస్తూ లోనికి వెళ్లేందుకు ప్రయత్నించాడు.
అయితే ఆలయం వద్ద సెక్యూరిటీగా ఉన్న పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ముర్తజా అబ్బాసీని అడ్డుకోబాగా తన వద్ద ఉన్న కొడవలితో పోలీసులు, స్థానికులపై దాడికి యత్నించాడు. దీంతో అక్కడున్న వారు భయాందోళన చెందారు. కొందరు అతడిపైకి ఇటుకలను విసిరారు. చివరకు అబ్బాసీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న ల్యాప్టాప్, మొబైల్ ఫోన్, టికెట్తో ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
కాగా, ముర్తజా అబ్బాసీ ఇటీవల ముంబై నుంచి గోరఖ్పూర్కు తిరిగి వచ్చాడని ఏడీజీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. గోరఖ్నాథ్ ఆలయంలోకి ప్రవేశించి భక్తులపై దాడి చేసేందుకు అతడు కుట్ర పన్నాడని ఆరోపించారు. ఇది ఉగ్రవాద దాడి కావచ్చని, దీనిపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ముంబైలో అతడి కార్యకలాపాలపై దర్యాప్తు కోసం నాలుగు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.
మరోవైపు ఐఐటీ బాంబేలో విద్యనభ్యసించిన అహ్మద్ ముర్తజా అబ్బాసీ, 2015లో కెమికల్ ఇంజినీరింగ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. అయితే 2017 నుంచి అబ్బాసీ మానసిక పరిస్థితి సరిగా లేదని ఆయన తండ్రి మహ్మద్ మునీర్ తెలిపారు. భార్యను వదిలేసి ఒంటరిగా ఉంటున్నాడని చెప్పారు. అహ్మదాబాద్తో పాటు పలు నగరాల్లో అతడు చికిత్స పొందాడని మీడియాతో అన్నారు.
కాగా, అబ్బాసీ తండ్రి మహ్మద్ మునీర్ అనేక ఫైనాన్స్ కంపెనీలకు న్యాయ సలహాదారుగా ఉన్నారు. ఆయన సోదరుడు వైద్యుడు. గోరఖ్పూర్లోని అబ్బాసీ హాస్పిటల్ యజమాని. మరోవైపు గోరఖ్నాథ్ ఆలయం వద్ద ఆదివారం సాయంత్రం అబ్బాసీ సృష్టించిన హంగామాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
IIT Mumbai Chemical Engineer Ahmed Murtaza attacked the security personnel of Gorakhpur Gorakshanath temple @iitbombay
This is the result of continuous targetting of Yogi gvt by liberals & leftists and poisoning minds of youth of this country with so much of hatred & false news. pic.twitter.com/TjWdx0bjyl
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) April 4, 2022