బెంగళూరు: వేగంగా వెళ్తున్న కారు డివైడర్ను ఢీకొట్టింది. ఆ తర్వాత 15 సార్లు పల్టీలు కొట్టింది. (Car Flips Multiple Times) ఒక వ్యక్తి ఆ వాహనం నుంచి గాల్లోకి ఎగిరిపడ్డాడు. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మంగళవారం ఉదయం కర్ణాటకలోని యాద్గిర్ జిల్లాకు చెందిన ఒక కుటుంబం బెంగళూరు నుంచి సొంతూరుకు కారులో వెళ్తున్నారు. చిత్రదుర్గ జిల్లాలోని జాతీయ రహదారి 150లో ఆ కారుపై డ్రైవర్ అదుపుకోల్పోయాడు. దీంతో డివైడర్ను ఆ వాహనం ఢీకొట్టింది. ఆ వేగం ధాటికి పక్కనున్న లేన్పై 15 సార్లు పల్టీలు కొట్టింది. ఆ కారులో ఉన్న వారిలో ఒక వ్యక్తి గాల్లోకి ఎగిరిపడ్డాడు.
కాగా, కారును డ్రైవ్ చేసిన 35 ఏళ్ల మౌలా అబ్దుల్, పిల్లలైన అతడి ఇద్దరు కుమారులు ఈ ప్రమాదంలో మరణించారు. గాయపడిన మిగతా కుటుంబ సభ్యులను హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు జాతీయ రహదారిలోని సీసీటీవీలో రికార్డైన కారు పల్టీలు కొట్టిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Karnataka: Shocking CCTV footage shows a Car flips 15 times, bodies thrown in the air, fatal accident on NH 150A between Challakere and Ballari near Bommakkanahalli Majid of Monakalmur taluk in Chitradurga district, claimed three lives, including two children. pic.twitter.com/Or6KIMd0ij
— Pinky Rajpurohit 🇮🇳 (@Madrassan_Pinky) April 2, 2025