రాజధాని రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు శుభవార్త. రైళ్లలో ఆన్బోర్డ్ క్యాటరింగ్ సేవలను తిరిగి పునరుద్ధరించినట్లు ఐఆర్సీటీసీ ప్రకటించింది. ఈ సౌలభ్యం రాజధాని రైళ్లన్నింటికీ వర్తిస్తుందని ఐఆర్సీటీసీ చైర్మన్ పేర్కొన్నారు. కోవిడ్ కారణంగా ప్రయాణికులు క్షేమం కోసం ఈ ఆన్బోర్డ్ క్యాటరింగ్ సేవలను నిలిపేశారు. ఈ సేవలను తిరిగి పునరుద్ధరిస్తున్నట్లు ఐఆర్సీటీసీ పేర్కొంది. ఫిబ్రవరి 1 నుంచే ఈ సేవలు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చేశాయని ఐఆర్సీటీసీ ప్రతినిధి ఆనంద్ ఝా పేర్కొన్నారు. అన్ని రాజధాని రైళ్లతో పాటు తేజస్ రాజధానిలో కూడా ఈ సౌలభ్యం కొనసాగుతోందని అన్నారు. రాజధాని రైళ్లలో ఆన్బోర్డ్ కేటరింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చాం. అయితే కోవిడ్ దృష్ట్యా బెడ్రోల్ సేవలపై మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అతి త్వరలోనే దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటాం అని ఐఆర్సీటీసీ పేర్కొంది.